ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే”

– ప్రధాని నరేంద్ర మోదీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ పాలనలోని ఘనతలు చెబుతూనే కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు చేశారు.

55 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో 55 నెలల తమ పాలనను పోల్చి చూడాలని మోదీ కోరారు. కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్లలో అధికారం కోసం అర్రులుచాస్తే తాము 55 నెలలూ దేశం కోసమే పనిచేశామని చెప్పారు.