బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌

త‌మిళ‌నాడు కూనురు నీల‌గిరికొండల్లో జ‌రిగిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్‌) బిపిన్ రావ‌త్ మ‌ర‌ణించారు. ఈ ప్రమాదంలో ఆయ‌న భార్య మ‌ధులిక రావ‌త్ కూడా మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 13 మంది మృత్యువాత ప‌డ్డారు.

బిపిన్‌ రావత్‌ మరణాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారికంగా ప్రకటించింది. బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌తో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందిన‌ట్లు వాయుసేన ధృవీక‌రించింది. తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

రావత్ షెడ్యూల్ ఇలా
వెల్లింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రావత్, ఆయన భార్య, మరో 12 మందితో కలిసి ఉదయం 11.40 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వెల్లింగ్టన్‌ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌.. కాసేపటికే కూనురు సమీపంలో కూలిపోయింది.