ఐస్‌క్రీమ్‌లో బల్లి


కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓ యువకుడు కొనుగోలు చేసిన ఐస్‌క్రీమ్‌లో బల్లి వచ్చింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన సృష్టించింది. రాంపూర్‌కు చెందిన వనం శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌క్రీం కొనుగోలు చేశాడు. అది తింటుండగా బల్లి కనబడడడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నాడు. ఐస్‌క్రీమ్ తయారీదారులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరాడు. గతంలో పలు హోటళ్లలో సాంబార్ల‌లో బల్లులు, బొద్దింకలు ప‌డ‌టం చూశాం. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు తినే ఐస్‌క్రీమ్‌లో కూడా బల్లులు కనబడడం గమనార్హం.