ప్రియాంకా గాంధీ లఖ్‌నవూ ర్యాలీ ‘నకిలీ ఫొటో’ తెలంగాణది

వీధి అంతా జనసందోహంగా కనిపిస్తున్న ఉన్న ఒక ఫొటో‌ను సోషల్ మీడియాలో పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. అది సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు నిర్వహించిన ర్యాలీ ఫొటో అని పేర్కొంటున్నారు.

ఈ ఫొటోలో కాంగ్రెస్ జెండాలు కనిపిస్తున్నాయి. కానీ, అది 2018 డిసెంబర్‌లో తీసిన చిత్రం.

ఈ ఫొటోను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది కూడా ట్విటర్‌లో సోమవారం షేర్ చేశారు, కానీ తర్వాత దాన్ని తొలగించారు. అనంతరం లఖ్‌నవూ ర్యాలీకి సంబంధించిన వాస్తవ ఫొటోను పోస్ట్ చేశారు.