తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా తెలంగాణాలో విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ నానాటికి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే 800 దాటినా పాజిటివ్ కేసులతో భయం గుప్పిటిలో ఉన్న ప్రజలకు మరింత భయాన్ని చూపెడుతుంది. ఈ కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 872కు చేరింది. తాజా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 12, మేడ్చల్‌లో ఒకటి, నిజామాబాద్ జిల్లాలో మరో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఇద్దరు మరణించడంతో వైరస్‌ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 23కు చేరుకుంది. 186 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 677 గా ఉంది.