కరోనా భాదితులకు అండగా పారిశ్రామికవేత్తలు

కరోన వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు దళిత పారిశ్రామికవేత్తలు. దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) తరపున ఈరోజు Dr బాబాసాహెబ్ అంబేడ్కర్ 129 వ జన్మదినం పురస్కరించుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటుగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు దళిత గిరిజన పారిశ్రామిక వేత్తలు. కె సి ఆర్ గారు అలాగే కె టి ఆర్ గారు రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం వల్ల లబ్ది పొందిన తాము పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా సమాజానికి తోడుగా నిలవాలని దీనిలో పాలుపంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు మున్సిపల్ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కె టి ఆర్ గారికి 25 లక్షల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అందోల్ ఏమ్మెల్యే క్రాంతికిరణ్ మరియు DICCI జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రా రవికుమార్ , దక్షిణ భారత ఉపాధ్యక్షుడు చంటి రాహుల్ కిరణ్ , రాష్ట్ర అధ్యక్షుడు కత్తెరపక రవికుమార్ , సురేష్ నాయక్ , మునీందర్ పాల్గొన్నారు .