హైదరాబాద్ లో కొత్త సబ్సిడరీని ప్రారంభించిన డెట్రాయిట్

ఇన్నవేటివ్ ఇంటిగ్రేషన్ ఉత్పత్తులు, సేవలు అందించే అమెరికాకు చెందిన ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ తన ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్ నగరంలో ఈరోజు ప్రారంభించింది. హైసియా ప్రెసిడెంట్ & డెలివరీ హెడ్ ఇన్ఫోసిస్, మనీషా సబూ ఈ ఐడీసీని ప్రారంభించారు.

దేశంలోనే వ్యాపారం, టెక్నాలజీలకు ప్రధాన కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో తన కొత్త డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ ప్రారంభంతో ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ ఇంక్ సంస్థ భారతదేశంలో తన రెండో కంపెనీని విస్తరించింది. ఈ సంస్థ ఆగ్నేయాసియా, భారతీయ సంస్థలకు సరికొత్త టెక్నాలజీలను గుర్తించడం, అమలు చేయడం, నిర్వహించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో మెరుగైన ఉత్పత్తులు, సేవలను సృష్టించడం, ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడంలో ఐటీ కంపెనీలకు సహాయపడుతుంది.

ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ కొత్త కేంద్రం ప్రారంభం సందర్భంగా సంస్థ సీటీవో సత్య శేఖర్ దాస్ మండల్ మాట్లాడుతూ, “భారతదేశంలో ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ ప్రపంచంలోని రెండు అతిపెద్ద సైట్లలో ఒకటి. ఇది ఐటీ సేవల్లో పోటీ పడేందుకు ఒక సానుకూలత పొందడానికి ముఖ్యమైన సాంకేతిక పురోగతిని అందిస్తుంది. కొత్త డెవలప్ మెంట్, సర్వీసెస్ సెంటర్ మొత్తం టర్నోవర్ లో 30% కంటే ఎక్కువ ఆదాయంతో 5 రెట్ల మంది ఉద్యోగులను కలిగి ఉంటుంది. భారతదేశం సాంకేతిక పురోభివృద్ధికి కేంద్రంగా మాత్రమే కాకుండా, ఇన్ఫోవ్యూ సిస్టమ్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కూడా. మాకు 80 మందికి పైగా భారతీయ క్లయింట్లు ఉన్నారు. మా క్లయింట్లకు అందుబాటులో అత్యుత్తమ సేవలను అందించడానికి మ్యూల్ సాఫ్ట్, కాన్ ఫ్లుయెంట్, ఐబీఎం, ఇతర ప్రముఖ టెక్నాలజీ ప్లాట్ ఫాంలతో కలిసి పనిచేశాం’’ అని వివరించారు.