రైలు టికెట్‌ సొమ్ము

రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టికెట్‌ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 మధ్యకాలంలో ప్రయాణించేందుకు చేసుకున్న రిజర్వేషన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు వివరించారు. బహిరంగ స్థలాల్లో అనవసర రద్దీని నిరోధించేందుకు, సామాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు రైల్వేశాఖ తెలిపింది.