సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ( ప్రగతి భవన్):

తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా positive కేసులు నమోదు అయ్యాయి

విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని వచ్చాయి

ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించాం

అనుమానితులను 14 రోజులపాటు quarantine లో ఉంచుతాం

విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, సెల్ఫ్ రిపోర్టు చేయాలి. ప్రభుత్వమే చికిత్స తో పాటు అన్ని ఖర్చులు భరిస్తుంది

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల మంది విదేశాల నుంచి వచ్చారు… అందులో 11 వేల మందిని అదుపులోకి తీసుకున్నా0.

కరోనా కట్టడికి 5274 నిఘా
బృందాలు పనిచేస్తున్నాయి

63000 మంది పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు

పిల్లలు, వృద్ధులు రెండు వారాలపాటు బయటికి రావొద్దు

రాష్ట్ర సరిహద్దుల్లో 54 చెక్పోస్టులను ఏర్పాటు చేశాము

24 గంటల జనతా కర్ఫ్యూ పాటిద్దాం

రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకూ జనతా కర్ఫ్యూ

ప్రధాని చెప్పింది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే

సిసిఎంబి లో ల్యాబ్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాను… సానుకూలంగా స్పందించారు

రేపు మెట్రో రైళ్లు, RTC బస్సులు, దుకాణాలు, అన్ని సేవలు బంద్

వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలి

ఎమర్జెన్సీ కోసం ఐదు మెట్రో ట్రైన్ లు, డిపోకు ఐదు చొప్పున బస్సులను అందుబాటులో ఉంచుతాం

ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయి

అవసరమైతే రాష్ట్ర సరిహద్దులను మూసి వేస్తాం

నా రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అయినా ఖర్చు చేస్తాం

కరోనా కు స్వాభిమానం ఎక్కువ… మనం ఆహ్వానిస్తేనే వస్తుంది

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వస్తువులకు రేపు రాష్ట్రంలోకి నో ఎంట్రీ

అవసరమైతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తాం

నిత్యావసరాల ధరలను ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి