విదేశాల్లోని 276మంది భారతీయులకు కరోనా!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌నూ వెంటాడుతోంది. దేశంలో కొవిడ్‌-19కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా..విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోన సోకినట్లు భారత విదేశాంగశాఖ తాజాగా వెల్లడించింది. వీరిలో 255మంది ఒక్క ఇరాన్‌లో చిక్కుకున్నవారు కాగా, 12మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో ఉన్నట్లు తెలిపింది. ఇక హాంకాంగ్‌, కువైట్‌, రువాండా, శ్రీలంక దేశాల్లో ఒక్కరు చొప్పున భారతీయులు కరోనా బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే మనదేశంలో 150మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.