జ‌గ‌న్‌కు సిగ్గుశ‌రం ఏమైన ఉందా ? : కాట్రాగ‌డ్డ ప్ర‌సూన

వైకాపా ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌న్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్ర‌గ‌డ్డ ప్ర‌సూన‌. విజ‌య‌వాడ న‌డిబొడ్డున మాన‌సిక విక‌లాంగురాల‌పై అఘాయిత్యం చేస్తే పోలీసులు ఏం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. త‌మ పిల్ల క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్‌కి వెళ్తే ఇప్పుడు, త‌ర్వాత రండి అని ఎలా చెబుతార‌ని అగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఈ సిగ్గుమాలిన పోలీసుల‌ను పెట్టుకొని సీఎం ఎలా రాష్ట్రాన్ని ఏలుతున్నార‌ని అన్నారు. ఈ విష‌యంలో సీఎం ఏమాత్రం సిగ్గూ, శ‌రం ఉన్నా… త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. బాధితురాలికి స‌రైన న్యాయం ద‌క్కేవ‌ర‌కు తెలుగుదేశం పార్టీ వారి వెంటే ఉండి పోరాటం చేస్తుంద‌ని తెలిపారు.

బాధితులు ఒక‌వైపు బాధ‌లో ఉంటే మ‌హిళా క‌మిష‌న్ ఛైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ డ్రామాలు ఆడింద‌ని మండిప‌డ్డారు. మాజీ ముఖ్య‌మంత్రి వ‌చ్చినా అక్క‌డ నుండి బ‌య‌ట‌కు రాకుండా కావాల‌ని గొడ‌వ సృష్టించింద‌ని అగ్రహాం వ్య‌క్తం చేశారు.