సామాన్యుల న‌డ్డివిరుస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్ : అనిత‌

జ‌గ‌న్ స‌ర్కార్ పేద ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌ముడుతోంద‌ని మ‌రోమారు మండిప‌డ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. ఓ వైపు విద్యుత్ కోత‌లు విధిస్తూ ఛార్జీలు పెంచుతూనే, మ‌రోవైపు ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణం చేయ‌కుండా అధిక ధ‌ర‌లు పెంచార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే పాల‌న అస్థవ్య‌స్తంగా మార‌డంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు. భ‌జ‌న బ్యాచ్‌తో రాష్ట్ర పాల‌న ఎలా కొన‌సాగుత‌ద‌ని ప్ర‌శ్నించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌జ‌లే త‌గిన బుద్ధి చెబుతార‌ని జోస్యం చెప్పారు.