మొద‌టి రోజే మొద‌లెట్టేశారుగా : అనిత

మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసి ఒక రోజు కూడా గ‌డ‌వ‌క‌ముందే భ‌జ‌న మొదలు పెట్టార‌ని విమ‌ర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌లపూడి అనిత‌. జ‌గ‌న్ వాళ్ల సొంత పార్టీ నాయ‌కులు పోగ‌డ‌డం కాదు నెత్తిన ఎక్కించుకొని తిరుక్కొని కానీ వేరు వారికి ఎందుకు ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఇంతకీ విషయం ఏంటి అంటే కొత్తగా జగన్ కొలువులో రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ అత్యుత్సాహంలో జగన్ భజన మొదలెట్టేశారు. అది ఆయన వరకూ ఉంటే ఎవరికీ బాధ లేదు కానీ వైసీపీ సర్కార్ ఏలుబడిలో తమ సమస్యలు ఏళ్ళకు ఏళ్ళు పెండింగులో పడి నలిగిపోతున్న జర్నలిస్టులు వాటి పరిష్కారానికి కూడా జగన్ని ఆరాధించమని ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించారు.