బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మార్చి 20 ఉదయం నాటికి ఇది వాయుగుండంగా మారనుందని తెలిపారు. అనంతరం మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, 2022 న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రలో శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాయలసీమలో శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.