పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తామని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముది రెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.