విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం : సీఎం జ‌గ‌న్

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల‌కు ఎటువంటి క‌ష్టం రాకుండా చూసుకుంటామ‌ని హామీ ఇచ్చారు ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి. అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వెళ్లిన విద్యార్థుల వివ‌రాలు సేక‌రించాల‌ని మంత్రుల‌ను, అధికారుల‌ను అదేశించారు. కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడి అక్క‌డ చిక్కుకున్న విద్యార్థుల‌కు భార‌తీయ ఎంబసీ ద్వారా స‌హాయం జ‌రిగేలా చూడాల‌న్నారు.

https://www.kooapp.com/koo/ysjagan/1aa7db31-b6e1-4d00-b49d-61ff4c8afe13