లంచ్ పే చ‌ర్చ @ ముంబాయి

దేశంలో రాజకీయాలు కొత్త‌రూపును సంత‌రించుకుంటున్నాయి. క‌లిసిక‌ట్టుగా మోడీని గ‌ద్దెదింపి జైలుకు పంపాల‌ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. బీజేపీని అధికారంలోని నుండి దింప‌డ‌మే ల‌క్ష్యంగా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సిద్ద‌మ‌వుతున్నారు. మొద‌ట‌గా శంఖ‌రావం పూరించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్‌థాక్రే నుండి మ‌ధ్యాహ్నా భోజ‌నానికి పిలుపు వ‌చ్చింది.
ఈ సందర్భంగా జాతీయస్థాయి రాజకీయాలు, కొత్త ఫ్రంట్ అంశాలు చర్చిస్తారని తెలుస్తోంది.

గత కొన్నిరోజుల వ్యవధిలో కేసీఆర్… పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడలతో ఫోన్ లో మాట్లాడారు. ఉద్ధవ్ థాకరేతోనూ మాట్లాడాలని ఆయన చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. వీరి భేటీ ఇన్నాళ్లకు కుదిరింది. ఫిబ్రవరి 20న ఇరువురు నేతలు భేటీ కానున్నారు.