సీఎం సోయి ఉండి మాట్లాడుతున్న‌డా : స్ర‌వంతి రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సోయి ఉండి మాట్లాడుతున్న‌డ లేక సోయిలేక మాట్లాడుతున్నారా అని మండిప‌డ్డారు నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి. డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ కేసిఆర్‌ ‌చేసిన అనుచిత వ్యాఖ్యాలకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో భాజ‌పా ఆధ్వర్యంలో శాంతియుతంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో కార్యక్రమాన్ని బాల్కొండ యువ నాయకులు మల్లిఖార్జున్ రెడ్డి గారితో మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలతో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పాలతో శుద్ధి చేశారు.