INDIAN CITIZENSHIP భారత పౌరసత్వానికి వేలాది మంది పాకిస్థానుల ధరఖాస్తులు
Indian Citizenship
భారతదేశంలో పాగ వేయడానికి పాకిస్థానీలు మరో స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా ఆ దేశీయులు మనపై దాడులు చేస్తున్నారు. మన సైనికులను పొట్టను పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాలు విస్మయానికి గురి చేస్తోంది. దాదాపు 7 వేలకు పైగా పాకిస్ధాన్ ప్రజలు మన దేశ పౌరసత్వానికి ధరఖాస్తులు చేసుకున్నారంటా.
పార్లమెంటు సభ్యుడు అబ్దుల్ వాహబ్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ.. పౌరసత్వం కోసం ఈ ఏడాది డిసెంబరు 14 నాటికి 10,635 వేలకు పైగా దరఖాస్తులు అందాయని, వాటిలో 7,306 మంది పాకిస్థానీయులే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, వీటిలో 70 శాతం వరకు దరఖాస్తులు పెండింగులో ఉన్నట్టు చెప్పారు. గత నాలుగేళ్లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్కు చెందిన 3,117 మంది మైనారిటీలకు పౌరసత్వం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి 1152, శ్రీలంక, అమెరికా నుంచి 223, నేపాల్ నుంచి 189, బంగ్లాదేశ్ నుంచి 161, ఇతర ప్రాంతాల నుంచి 428 మంది దరఖాస్తు చేసుకున్నట్టు మంత్రి తెలిపారు. చైనా నుంచి కూడా పౌరసత్వాన్ని కోరుతూ పది మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఎంపీ కె. కేశవరావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత నాలుగేళ్లలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లోని హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవుల నుంచి 8,244 దరఖాస్తులు అందాయని, వాటిలో 3,117 మంది పౌరసత్వం ఇచ్చినట్టు వివరించారు. అలాగే, గత ఐదేళ్లలో 6 లక్షల మందికిపైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రం ఇటీవల వెల్లడించింది.











