OMIKRON VIRUS తెలంగాణలో భారీగా ఓమిక్రాన్ కేసులు
OMIJRON VIRUS
తెలంగాణలో ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 14 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దాంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది.
ఇక రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 37,353 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 91 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. హన్మకొండ జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి.











