జ‌గ‌న్ ఓ ఇగోయిస్టు – క‌న్నా

ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అని విమర్శించారు. తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు భూములిచ్చారని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ముందుకు వెళ్లడం మూర్ఖత్వమని అన్నారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను భరిస్తూనే రైతులు తమ పాదయాత్రను పూర్తి చేశారని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది బీజేపీ స్టాండ్ అని తెలిపారు.