టీం ఇండియా వ‌న్డే కెప్టెన్‌గా రోహిత్‌

విరాట్ కోహ్లికి షాక్ ఇస్తూ… డాషింగ్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శ‌ర్మ టీ20 తోపాటు వ‌న్డేల‌కు సార‌ధిగా నియ‌మిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణంతో విరాట్ షాకింగ్‌కి గురైన‌ట్లు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ అయిన టీ20 నుండి త‌ప్ప‌కున్న‌ట్లు స్వ‌యంగా ఆయ‌నే ప్ర‌క‌టించినా… వ‌న్డేల‌కు మాత్రం విరాట్ త‌ప్పిస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. 2023లో భార‌త్‌లో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ సారాధిగా కొన‌సాగే అవ‌కావం ఉంది.

త్వ‌ర‌లో జ‌రిగే ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు కూడా టెస్ట్ టీం వివ‌రాల‌ను ఈ మేర‌కు ప్ర‌క‌టించింది. కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, శ్రేయస్, విహారి, పంత్, సాహా, అశ్విన్, జయంత్, ఇషాంత్, షమీ, ఉమేశ్, బుమ్రా, శార్దుల్, సిరాజ్‌.
స్టాండ్‌బై: నవదీప్‌ సైనీ, దీపక్‌ చహర్, అర్జన్‌ నాగ్‌వాస్‌వాలా, సౌరభ్‌ కుమార్‌.