వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం-హత్య జరిగినట్లు ఆధారాలు


సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. వివేకా నుదుటి ప్రాంతం, తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంతో ఆయ‌న మ‌ర‌ణంపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో, ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ అవినాష్‌రెడ్డి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.
‘మా పెదనాన్న తల మీద, చేతి వేళ్లపైన, ముఖంపైన గాయాలున్నాయి. ఎవరో దాడి చేయడం వల్లే ఆయన మరణించినట్టు ఉంది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది’ అని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.