ఐపీఎల్ వాయిదా

క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కరోనా కాటుకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-14ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కాసేపటి క్రితం ప్రకటించారు.
ఇంకా ఈ సీజన్‌లో 30కి పైగా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గ్లోబల్ క్రికెట్ క్యాలెండర్, కోవిడ్ పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్‌లను రీ షెడ్యూల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్-14 మిగతా భాగాన్ని నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా కరోనా బారిన పడ్డాడు.