కాంగ్రెస్‌కు సబితా ఇంద్రారెడ్డి గుడ్‌బై

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తనయుడు కార్తీక్‌ రెడ్డితో సహా ఆమె రేపు(బుధవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తమ ఎమ్మెల్యేను పార్టీ మారకుండా బుజ్జగించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహాలు బెడిసికొట్టినట్లైంది. కాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌..ఆమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.