ప్ర‌భుత్వ సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివి : ‌తిరుప‌తి యాద‌వ్‌

గోదావరి వరదతో పాటు వాగులతో వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివ‌ని అన్నారు తెరాస యువ నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్‌. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు తీవ్ర ఇబ్బందులు క‌లిగిస్తున్నా…. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌ర్కార్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని యువ‌కులు కూడా ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచ‌కుంటున్నార‌ని తెలిపారు. వ‌ర‌దలు వ‌చ్చిన ప్రాంతాల్లో ‌ సాయం చేయ‌డానికి తెరాస యువ‌త ముందుకు వ‌స్తుంద‌ని తెలిపారు. ‌