భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు గోదావరి ప్రవాహం రాత్రి 9 గంటలకు ప్రమాదకర స్థాయిని మించవచ్చని సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీ చేసింది.