భాజ‌పాలోకి గాడిప‌ల్లి అరుణ రెడ్డి

భార‌త‌దేశం అభివృద్ధిలో సాగాలంటే ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే సాధ్య‌మ‌న్నారు గాడిప‌ల్లి అరుణ రెడ్డి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ మ‌హిళ విభాగం ఉపాధ్యక్షురాలు గాడిప‌ల్లి అనురాధ భాజపా చేరారు. దేశం కోసం మోడీ చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల వ‌ల్లే ఆక‌ర్షితురాలై పార్టీలో చేరిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక సిద్దిపేట కాషాయం జెండ ఎగ‌ర‌వేయ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. భాజ‌పా రాష్ట్ర కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్ రావు స‌మ‌క్షంలో ఆమె పార్టీలో చేరారు. పార్టీ నియమాల‌కు క‌ట్టుబ‌డి పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తామ‌ని తెలిపారు.