భారత్‌లో 40 వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు 40 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 40,263కి చేరింది. ఇప్పటివరకు 10,887 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 28,070 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో మృతి చెందిన వారితో కలిపి ఇప్పటివరకు  1,306 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.