తెలంగాణలో ఇవాళ 21 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 21 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 20 కేసులు నమోదవగా.. జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ తాజాగా డిశ్చార్జ్‌ అయిన 46 మంది బాధితులతో కలిపి మొత్తంగా 545 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 508 యాక్టివ్‌ కేసులున్నాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1082కు చేరింది.