తెలంగాణలో తొమ్మిది వందలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

రోజు రోజుకి కరోనా విలయతాండవం చేస్తుంది. షేర్ మార్కెట్ల ఒక రోజు తగ్గుతూ… మరో రోజు పెరుగుతూ… అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతుండటంతో పాజిటివ్ సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 928కి చేరుకుంది. తాజాగా మరో 8 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 194 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 711 గా ఉంది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేటలో అత్యధికంగా 26, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 3, గద్వాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, మేడ్చల్‌, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు చొప్పున నమోదయ్యాయి.