కిమ్స్ సవీర నుండి కరోనా భాదితుల డీఛార్జి

అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుపత్రి నుండి కరోనా వ్యాధి సోకినా ఇద్దరు ఇవాళ సాయంత్రం డీఛార్జి అయినట్లు ఆసుపత్రి క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రవిశంకర్ తెలిపారు. కొన్ని రోజల క్రితం హిందూపురంకి చెందిన వేరు వేరు కుటుంబాలలో నివసిస్తున్న వారికీ ఈ కరోనా వ్యాధి సోకింది. ఈ నెల 7వ తేదీన ఆసుపత్రిలో చేరారాని, గత కొన్ని రోజులుగా వారికి కిమ్స్ సవీరలో చికిత్స అందిస్తున్నట్లు అయన తెలిపారు. 35 సంవత్సరాల మహిళా, 10 సంవత్సరాల అబ్బాయి కరోనా వ్యాధిని జయించారని వివరించారు. ఈ సందర్బంగా కిమ్స్ సవీర యాజమాన్యం, వైద్య బృందం వారికి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియజేసారు. ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తున్న ఈ వ్యాధిని ప్రారంభ దశలనే గుర్తిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. మరో 15 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.