19న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులలో తెలంగాణాలో ఎలా అమలు చేయాలన్న అంశంపై ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏప్రిల్ 20 తర్వాత కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వాలా? వద్దా? అనే అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, అలాగే లాక్ డౌన్ కొనసాగింపు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. కేంద్రమార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులు ఇవ్వాలా? వద్దా? ఒకేవేళ ఇస్తే.. ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నదానిపై కూడా చర్చించే అవకాశముంది.