ఐపీఎల్‌-13 కథ ముగిసినట్టే

కరోనా ప్రభావంతో ఐపీఎల్‌-13వ సీజన్‌ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జ‌య్ షా అధికారికంగా తెలియజేశారు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసే విషయాన్ని బుధవారమే ఫ్రాంచైజీలకు తెలియజేయగా, తాజాగా దీనిపై ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి అధికారికంగా నిర్ణయాన్ని ప‍‍్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఎటువంటి ప్రమాదం లేదు అన్నప్పుడే ఐపీఎల్‌ కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు.