కరోనా బాధితుల కోసం మాతా అమృతానందమయి దేవి 13 కోట్ల విరాళం

మాతా అమృతానందమయి మఠం covid’19 బాధితుల సహాయ నిధికి పదమూడు కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో పది కోట్లు ప్రధానమంత్రికి CARE నిధికి, మూడు కోట్లు కేరళ CMDF నిధికి అందజేస్తారు.

మఠం విడుదల చేసిన ప్రకటనలో ” Covid’19 కారణంగా ప్రపంచం యావత్తూ అనుభవిస్తున్న బాధను చూసి మనసు తల్లడిల్లుతుందన్నారు అమ్మ. Covid’19 వల్ల మృతి చెందిన వారి ఆత్మకు, వారి కుటుంబ సభ్యులకు మరియు ప్రపంచానికి శాంతి చేకూరాలని ఆ భగవంతునికి ప్రార్థిద్దామన్నారు”

అమ్మ కోరిక మేరకు అమృత విశ్వవిద్యాలయం, అమృత హాస్పిటల్ కలిసి Covid’19 కారణంగా ఒత్తిడికి, ఆందోళనకి, కుంగుబాటుకు గురైన వారికి సహాయం అందించడానికి ప్రత్యేకంగా హాట్ లైను ఏర్పాటు చేశారు. వైద్యులను, ప్రత్యేకంగా మానసిక వైద్యులను Covid’19 బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సమయం కేటాయించాలని అభ్యర్థించారు అమ్మ. తాము నమ్మినా నమ్మకపోయినా రోజులో రెండు గంటలు సమయం అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సమయంలో కౌన్సెలింగ్ కూడా ఒక సేవ లాగ భావించాలి అని అన్నారు.

మానవాళి జీవనశైలిని మార్చుకొని ప్రకృతితో సామరస్యంగా వ్యవహరించాలని లేదంటే ప్రకృతి వైపరీత్యాలకు గురికావాల్సి వస్తుందని దశాబ్దాలుగా అమ్మ నొక్కి చెబుతున్నారు. మానవుడు ప్రకృతి పట్ల స్వార్థంతో వ్యవహరించడం వల్లనే అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అన్నారు, మనం ప్రకృతికి సేవకులం మాత్రమే అనే తత్వాన్ని పెంపొందించుకోవాలని, ప్రకృతి పట్ల వినయంగా, గౌరవంగా, దాసులుగా ఉండేందుకు అభ్యాసం చేయాలన్నారు.

ఇప్పటికైనా అహంకరించటం మానుకోవాలి. ప్రకృతి ముందు మోకరిల్ల వలసిన సమయం వచ్చేసింది. ఇది మనం ప్రకృతి పట్ల చేసిన అపరాధాలకు పరిహారం చెల్లించుకోవలసిన సమయం. ప్రకృతి మనం ఏం చేసినా భరిస్తుంది, బాధించినా క్షమిస్తుంది అనే భయంలేని నిర్లక్ష్య ధోరణి విడనాడాలి. ప్రకృతి మనల్ని మేలుకొని చుట్టూ చూడమంటూ ఆదరిస్తుంది. నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపటానికి ప్రకృతి Covid”19 రూపంలో హెచ్చరికలు జారీ చేస్తుంది.

అమృత విశ్వవిద్యాలయంతో పాటు మాతా అమృతానందమయి మఠం, వివిధ రంగాల్లో వైద్య నిపుణులు, పరిశోధనల ద్వారా మాస్కులు, గౌనులు, వెంటిలేటర్లు మొదలైనవి తక్కువ ధరలో తయారు చేయడమే కాక , ఐసొల్యూషన్ వార్డ్స్, వైద్య సంబంధిత వ్యర్థాలను శుభ్రపరిచే యూనిట్లు నిర్వహిస్తుంది. క్వారంటైన్ లో ఉన్న రోగులను దూరం నుండి పర్యవేక్షించే విధానాన్ని రూపొందించింది. వివిధ రంగాలకు చెందిన 60 మంది నిపుణులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.
ఆన్లైన్ తరగతులు ద్వారా ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులు Covid’19 సంబంధించిన పాఠ్యాంశాలు నేర్చుకొని వివిధ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు.

మఠానికి చెందిన కార్యకర్తలు 101 దత్తత గ్రామాల వారికి అవగాహన కల్పిస్తున్నారు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు వారికి తెలియజేస్తున్నారు, Covid’19 కి సంబంధించిన అసత్య/తప్పుడు వార్తలు వ్యాపించకుండా చూస్తున్నారు. ఈ గ్రామాల వారికి మాస్కులు కొట్టడంలో శిక్షణ ఇచ్చి, ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా మాస్కులు సరఫరా చేస్తున్నారు

2005 నుంచి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం, గృహ రుణాలు పంపిణీ, ఉచిత వైద్యం, గృహ నిర్మాణం, మొదలైన వాటికీ దాదాపు 500 కోట్ల సహాయం మాతా అమృతానందమయి మఠం చేసింది.