తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా వైరస్ తెలుగు రాష్ట్ర్లాలలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణ కంటే ఏపీలో కాస్త వెనక ఉన్నారోజు రోజుకి జిల్లాల వ్యాప్తంగా పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.
ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో.. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ఏడుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు.