ప్రధాని అదే మాట్లాడనున్నారా ?

ప్రపంచంలోని అగ్ర దేశాలను వణికించిన కరోనా మహమ్మారి భారతదేశం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది.
అయితే అన్ని దేశాల కంటే మన దేశం కాస్త ముందే మేల్కొని లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రేపటితో ముగియనున్న ఈ లాక్ డౌన్ మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అయితే ఇప్పటికే తెలంగాణ తో పాటు కొన్ని రాష్ట్రాలు ఈ నెల చివరి వరకు లాక్ డౌన్ పొడిగించాయి. ప్రధానంగా మహారాష్ట్ర లో ఈ కరోనా తన ప్రతాపాన్ని ఎక్కువ చూపించింది. దేశం లో ఎక్కువ కేసులు అక్కడే నమోదు కాగా తమిళనాడు రెండో స్థానంలో ఉంది. కాగా లాక్ డౌన్ ని విధిగా పాటిస్తున్న రాష్ట్రాలలో కొద్దిగా మెరుగైన ఫలితాలు వస్తున్నాయి . అయితే దేశ వ్యాప్తంగా ఈ లాక్ డౌన్ ని ఈ నెల చివరికి వరకు పొడిగించే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.