విరాళాల ప్రకటన

ఆంధ్ర, తెలంగాణ సిఎం సహాయనిధికి మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు రూ.5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో పలువురు క్రీడాకారులు తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో 44 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ముగ్గురు మరణించారు. ఇక ఆంధ్రలో కరోనా పాజిటివ్‌ కేసులు పదికి పెరిగాయి. భారత్‌లో ఇప్పటివరకు 719 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 16 మంది మృతి చెందారు. పివి సింధు రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానమంతి సహాయనిధికి టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ విరాళాన్ని అందించాడు.