చిరంజీవి మ‌ద్ద‌తు కోరిన మ‌ల్లారెడ్డి

భారత్ రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు కావాల‌ని చిరంజీవిని కోరారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఇస్కాన్ అధ్వర్యంలో మల్లారెడ్డి యూనివర్శిటీలో కిల్ క్యాన్సర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా సినీ నటులు చిరంజీవి, మంత్రి మల్లారెడ్డి హాజ‌రైనారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చిరంజీవి నేను జీవితంలో అన్ని అనుభవించాం. చిరంజీవి అంతా గొప్పోన్ని కాను నేను. చిరంజీవి గారు సినీ రంగంలో గొప్ప వ్యక్తి. కేంద్ర మంత్రి గా పని చేశారు. జీవితంలో అన్నీ అనుభవించిన మాకు ప్రజా సేవ చేయాలని ఆకాంక్ష. నేను చిరంజీవి గారిని ఒకటే కోరిక కోరుతున్న. మనమిద్దరం కలిసి ప్రజాసేవ చేద్దాం.
సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రజాసేవ చేస్తున్నారు. కెసిఆర్ జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టారు. చిరంజీవి గారు బిఆర్ఎస్ కు సహకరించాలని కోరుతున్న, మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనా మన అందరి పైనా ఉందని మ‌ల్లారెడ్డి చిరంజీవితో అన్నారు.