కరోనా దెబ్బకు మరొకరు మృతి

కరోనా వైరస్ మనదేశం లోను రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలెడుగులోకి వస్తుండడం తో కేంద్రం అలర్ట్ అయ్యింది. తాజాగా గువువారం కరోనా సోకి నాల్గో వ్యక్తి మరణించారు. పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు.

తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఆయన ఇటలీ,జర్మనీ లో తిరిగి భారత్ కు వచ్చాడు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 4కి చేరింది. గతవారంలో మొదటగా కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఆ తర్వాత ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.