మ‌ళ్లీ టూర్ ప్లాన్ చేసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లుండి(31వ తేదీన) బిహార్‌ పర్యటనకు వెళ్లనున్నారు. గల్వాన్‌ ఘర్షణల్లో అమరులైన ఐదుగురి జవాన్ల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు వారికి ఆర్థిక సాయం అందజేయనున్నారు. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు. బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నట్లు సమాచారం.