తాను చ‌నిపోతూ ఐదుగురికి ప్రాణాదానం

తాను చ‌నిపోతూ ఐదుగురికి ప్రాణాలు కాపాడారు వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన పోలీస్. వివ‌రాల్లోకి వెళ్తే గ‌త శనివారం వరంగల్ ప‌ట్ట‌ణం మిల్స్ కాల‌నీలోని పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో ప్ర‌మాదవాశాస్తూ బైక్‌పై నుండి జారి కింద‌ప‌డిపోయారు. అత‌ని వెన‌క నుండి వేగంగా వ‌స్తున్న కారు అత‌నిపై నుండి దూసుక‌పోయింది. దీంతో అత‌న్ని వెంట‌నే స‌మీపంలోని రోహిణి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ త‌రువాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిట‌ల్‌కి తీసుక‌వ‌చ్చారు. అత‌న్ని ర‌క్షించ‌డానికి రెండు రోజుల పాటు వైద్యులు ఎంతో శ్ర‌మించారు. కానీ దురుదృష్ట‌వశాస్తూ సోమ‌వారం రోజున బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ త‌ర్వాత అవ‌య‌వ‌దానంపై అవ‌గాన క‌ల్పించిన అనంత‌రం.. అత‌ని భార్య, సోద‌రుడు, మిత్రుల అంగీకారంతో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు (మూత్ర‌పిండాలు), కార్నియా అవ‌య‌వదానం చేశారు. చ‌నిపోతూ ఐదురుగురి జీవితాల్లో వెలుగులు నింపింనందుకు గ‌ర్వంగా ఉంద‌ని మృతిని భార్య తెలిపారు. స‌హ‌చ‌ర పోలీసులు, స్థానికులు కూడా వారి కుటుంబ స‌భ్యుల‌ను అభినందించారు.