ఆత్మ‌కూరు అసెంబ్లీ మ‌ళ్లీ మేక‌పాటి కుటుంబానికే

ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి కుటుంబానికే తిరిగి ఎమ్మెల్యే సీటు కేటాయించాల‌ని గౌత‌మ్ రెడ్డి తండ్రి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని కోరారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో గౌత‌మ్ రెడ్డి, రాజ‌మోహ‌న్ రెడ్డి, గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్‌రెడ్డిలు సీఎంతో స‌మావేశ‌మైనారు.

గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలో వైసీపీ అభ్య‌ర్థిగా మేక‌పాటి కుటుంబ స‌భ్యుల‌కే ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.