దేశంలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వ్యాప్తి మ‌ళ్లీ మొద‌లైంది. ఇప్ప‌టికే మూడు ద‌శ‌ల‌లో ప్ర‌జ‌ల‌పై విశ్వ‌రూపం చూపించిన కోవిడ్‌-19 వైర‌స్ చాప‌కింద నీరులా మ‌ళ్లీ పాకుతోంది. తాజాగా ఆదివారం 1,150 మందికి వైరస్ సోకగా.. సోమవారం ఆ సంఖ్య 2,183కి చేరింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. వైరస్ కారణంగా మరో 214 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280కు చేరగాా.. మరణాల సంఖ్య 5 లక్షల 22వేలకు సమీపించింది. యాక్టివ్ కేసులు 11,500కుపైగా ఉన్నాయి.