బైంసాలో శ్రీ‌రామ న‌వమి శోభ‌యాత్ర‌

ఎట్ట‌కేల‌కు బైంసాలో శ్రీ రామ‌న‌వమి శోభ‌యాత్ర‌కు అనుమ‌తి ల‌భించింది. ఈ మేర‌కు తెలంగాణ హైకోర్టు అనుమ‌తులు మంజూరు చేసింది. శుక్ర‌వారం నాడు యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. యాత్ర‌లో డీజే మ్యూజిక్ బ్యాండ్‌ను వాడ‌రాద‌ని ఆంక్ష‌లు విధించింది. అంతేకాకుండా ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌లోగా యాత్ర‌ను ముగించాల‌ని పేర్కొంది. ఇక యాత్ర‌లో 200 మందికి మించి పాల్గొన‌రాద‌ని కూడా హైకోర్టు ష‌ర‌తు విధించింది.