ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతోంది : కిష‌న్ రెడ్డి

ఉక్రేయిన్‌లో చిక్కుకున్న వారికి భార‌త‌దేశానికి త‌ర‌లించ‌డానికి ఆప‌రేష‌న్ గంగా కొన‌సాగుతుంద‌ని అన్నారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ర‌ష్యా, ఉక్రేయిన్ దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధం త్వ‌ర‌గా ముగియాల‌ని ఆకాంక్షించారు. భారతీయ వైమానిక దళం ఈరోజు ఉదయం #OpGangaలో చేరింది, అది మన పౌరులను తిరిగి తీసుకురావడానికి రొమేనియాకు హెవీ లిఫ్ట్ C-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాన్ని పంపిందని కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు.