వ‌ల్ల‌భ‌నేని వ‌ణికిపోయాడా లేక వ‌ణికించారా ?

ఏపీ రాజ‌కీయాల్లో అత్య‌తం కీలకంగా మారిన మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు వివాదం ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తోంది. మాజీ సీఎం చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌ని మ‌నోవేద‌నకు గురై అసెంబ్లీ నుండి శ‌ప‌దం చేసి బ‌య‌ట‌కు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చారు చంద్ర‌బాబు. అయితే ఆ వెంట‌నే తేర‌కున్న నంద‌మూరి కుటుంబం అసెంబ్లీలో జ‌రిగిన సంఘ‌ట‌న‌కు ఘాటుగానే స‌మాధానం ఇచ్చింద‌నే చెప్పుకోవాలి. మ‌రో వైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందించ‌డం…. దానిపై జ‌రిగిన దూమారం తెలిసిందే.

అయితే తాజాగా వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓ టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ నారా భువ‌నేశ్వ‌రిపై చేసిన వ్యాఖ్య‌లు వాస్త‌వ‌మేన‌ని అందుకు మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ కోరుతున్నాన‌ని వెల్ల‌డించారు. అయితే కులం నుండి వెలివేయ‌డ‌మో లేదా ఇంకా దేనికైనా భ‌య‌ప‌డి తాను క్ష‌మాప‌ణ చెప్ప‌డం లేద‌ని తెలిపారు. త‌న‌ను కానీ కొడాలి నానిని గాని భ‌య‌పెట్టేవారు పుట్ట‌లేద‌ని అన్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఈ ర‌చ్చ‌లో వైకాపా నాయ‌కులు ఏ మాట అన‌లేద‌ని కావాల‌ని చంద్ర‌బాబు డ్రామా చేస్తున్నార‌ని వైకాపా నాయకులు అన్నారు. అయితే వ‌ల్ల‌భ‌నేనా తాజా వ్యాఖ్య‌లపై ఆ పార్టీ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మ‌రి.