యశోద ఆసుపత్రిలో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ తుదిశ్వాస విడిచారు. నర్సింగ్‌ యాదవ్‌ అనేక తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలు పోషించి మెప్పించారు.

తెలంగాణ, హైదరాబాద్ యాసతో… సినిమా రంగంలో విలన్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన మృతితో… యావత్ సినిమా రంగం ఆవేదనలో ఉంది.