తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ జోరు : బ‌ండిసంజ‌య్‌

తెలంగాణ‌లో రానున్న రోజుల్లో క‌మ‌లం పార్టీ జోరు కొన‌సాగుతుంద‌ని భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. ‌ ఢిల్లీలో ఎంపీ బండి సంజయ్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యంను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే అంశాలు, కమలం పార్టీ బలోపేతం, కరోనా మహామ్మారి కారణంగా ఎదురవుతోన్న సవాళ్లపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అంశాలపై భాజ‌పా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఎదురైన కరోనా మహమ్మారి విపత్తు కారణంగా ఎదురైన సవాళ్లు, లాక్ డౌన్ పరిస్థితుల్లో తెలంగాణాలో కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సేవ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ అంశాలు బండి సంజయ్ బాలసుబ్రమణ్యం దృష్టికి తీసుకు వెళ్లారు. రాబోయే రోజుల్లో కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకే పార్టీ తెలంగాణ విభాగం అలుపెరగకుండా ప్రజలకు సహకారాన్ని అందించడంలో కృషి చేయాలని కామర్సు బాలసుబ్రమణ్యం రాష్ట్ర అధ్యక్షుడికి సూచించారు.