హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గులేదు : తెజ‌స‌

టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెజ‌స మెద‌క్ జిల్లా యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌ర‌శేఖ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. నేతలు ప్రజాసంక్షేమాన్ని వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిపక్షంగా తెజ‌స సలహాలు ఇస్తుంటే రాజకీయ ఉద్దేశ్యంతో చూస్తూ, అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. కరోనా విషయంలో హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పద్ధతి మార్చుకోకుండా ప్రజలను మభ్య పెడుతోందని మండిపడ్డారు.